బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టం.అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరిగాయి అంటే కొన్ని కొన్ని సార్లు తారా స్థాయికి చేరుకుంటాయి.
ఇకపోతే ప్రస్తుతం తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య గొడవలు, యుద్ధాలు జరుగుతున్నాయి.
అంతేకాకుండా కంటెస్టెంట్ లు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు కాకుండా వారికి ఇష్టం వచ్చిన విధంగా ఆడుతూ బూతులతో రెచ్చిపోతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కంటెస్టెంట్ ల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అఖిల్,బిందు మాధవి లకు ఒకరంటే ఒకరికి అసలు పడటం లేదు.అంతేకాకుండా బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున వారిద్దరి మధ్య కోపాన్ని తగ్గించడానికి ఎంత ప్రయత్నించినా కూడా అది వర్కవుట్ అవ్వడంలేదు.
వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది వారిద్దరి యవ్వారం.వీరిద్దరి మధ్య ప్రతి వారం కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.మొన్న ఒక సారి బిందుమాధవి ఆడ అన్న పదం ఉపయోగించింది అని నానా రచ్చ చేసిన విషయం తెలిసిందే.

అంతకు ముందు నుంచి వీరిద్దరి మధ్య ఉన్న దూరం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.ఇదిలా ఉంటే వీరిద్దరి మధ్య గొడవ ఏడవ వారం మరింత ఎక్కువ అయినట్టు గా కనిపిస్తోంది.ఏడో వారం నామినేషన్స్ లో భాగంగా బిందు మాధవి, అఖిల్ ఒకరి నుంచి మరొకరు రెచ్చిపోయారు.
జంట నామినేషన్లు అని చెప్పి అఖిల్ బిందుమాధవి ల మధ్య నామినేషన్ చిచ్చు పెట్టేసాడు బిగ్ బాస్.వీరిద్దరి మధ్య మాటలు కాస్త చిలికిచిలికి గాలివానలా మారాయి.
అఖిల్ ని బిందు మాధవి ఒరేయ్ అఖిల్ గా చెప్పురా! అని అనగా అప్పుడు ఆ కి ఏ మాత్రం తగ్గకుండా ఒసేయ్.ఏం చెప్పాలే బిందు.అంటూ మరింత రెచ్చిపోయాడు.ఇక వీరిద్దరి మధ్య దూరం ఇంకెంత పెరుగుతుందో చూడాలి మరి.







