విజయనగరం జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది.ఈ క్రమంలోనే తాజాగా దత్తిరాజేరు మండలంలో పులి కనిపించింది.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పెదకాక సమీపంలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
గత కొన్ని రోజులుగా జిల్లాలోనే తిష్ట వేసిన పులి.ఇప్పటికే పశువులపై దాడికి పాల్పడుతుంది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.