భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధానకార్యదర్శి భగవంత్ రావు కామెంట్స్.9వ తేదీన గణేష్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయించింది.అనంత చతుర్దశి కాబట్టి శుక్రవారమే నిమజ్జనం చేయాలి.కొంతమంది పోలీసులు 9వతేది నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారు.కొంతమంది వాటిని వాట్స్ అప్ లో సర్క్యులేట్ చేస్తున్నారు అవి నమ్మొద్దు.కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి.
కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి…అందులో భాగంగా ప్రభుత్వం కూడా గత ఏడాది మాదిరిగా నిమజ్జనం నిర్వహిస్తామని చెప్పింది.పాండ్స్ ఏర్పాటు చేశామని చెప్పింది.
అవి ఎన్ని చేశారో తెలియడంలేదు.భక్తులను పాండ్స్ దగ్గరకు వెళ్ళనివ్వడం లేదు.
గణేష్ విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారు.అటువంటి అపశృతి లేకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి.నిమజ్జనానికి ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేయాలి.పాండ్స్ లొనే నిమజ్జనం చేయాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు.
బాలాపూర్ గణేష్ సమితికి కూడా అదేవిధంగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.అటువంటి చర్యలు మానుకోవాలి.
బతుకమ్మ, క్రిస్ మస్, రంజాన్, మోహర్రం పండుగల మీద ఉన్న ఆసక్తి గణేష్ ఉత్సవాల పై లేదు.సత్యవతి సిన్హా 2001లో ఇచ్చిన జడ్జిమెంట్ లో కూడా వినాయక సాగర్ లో నిమజ్జనం చేయొద్దని చెప్పలేదు.24 గంటల్లోనే నిమజ్జనం చేసిన వ్యర్థాలను తొలగిస్తున్నాం.దాంతో కాలుష్యం కావడంలేదు.
నిమజ్జనంతో ఎలాంటి అపశృతి జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి.తమిళనాడు జల్లికట్టు అంశంలో కోర్ట్ లో కేసు ఉన్నా.ఏవిధంగా చర్యలు తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిమజ్జనాలకు అదేవిధమైన చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.
గణేష్ ఉత్సవాలకు ముందే చర్యలు తీసుకోవాలి.గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ లోనే చేయాలని రేపు ట్యాంక్ బండ్ పై బైక్ ర్యాలీ నిర్వహిస్తాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ హిందూ వ్యతిరేక ధోరణి అవలంభిస్తున్నారు.నిమజ్జనానికి సరైన ఏర్పాట్లు లేకుంటే ఎక్కడి విగ్రహాలు అక్కడ పెట్టి నిరసన చేస్తాం.