ముఖ్యంగా చెప్పాలంటే మహాభారతంలో( Mahabharatam ) అర్జునుడు తన సమీప బంధువులతో పోరాడవలసి వచ్చినందుకు నిరాశ చెందుతాడు.బంధువులతో ఎలా పోరాడగలను అని విచారిస్తాడు.
అప్పుడు భగవద్గీత( Bhagavadgita ) ద్వారా అర్జునుడి ప్రశ్నల కు శ్రీకృష్ణుడు సమాధానం చెబుతాడు.శ్రీమాత్ భగవద్గీత మహాభారతంలోని విదుర నీతి కూడా మహాభారతానికి రెండు స్తంభాలు అనే పండితులు చెబుతున్నారు.
శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్యాయం పై పోరాడమని గీతోపదేశం చేస్తాడు.
అందులో కొన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.మన గత కర్మల ఫలితమే మన భవిష్యత్తు అని పండితులు చెబుతున్నారు.ఈ రోజు మనం తీసుకునే చర్యలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
అందుకే మన కర్మలను ఎప్పుడూ చక్కగా ఉంచుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే శాంతి, సౌమ్యత, మౌనం, స్వీయ నియంత్రణ, స్వచ్ఛత అనే ఐదు అంశాలు మనసును క్రమశిక్షణలో ఉంచుతాయి.
ప్రతి వ్యక్తి ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి.అప్పుడే సరైన మార్గంలో నడవగలడు.
భగవద్గీత ప్రకారం ప్రతి మనిషికి ఏదో ఒక ప్రతిభ కచ్చితంగా ఉంటుంది.
కానీ మనలోని ఈ ప్రతి పని గుర్తించే బదులు తెలుసో తెలియకో తల్లిదండ్రులలో( Parents ) ఇతరులో లేక పరిస్థితుల్లో వల్ల ఇది వెలుగులోకి రాదు.కానీ శక్తి ఉన్న తెలియకపోవడానికి క్లేశమే కారణమని శ్రీకృష్ణుడు( Sri Krishna ) సెలవిచ్చాడు.అంతే కాకుండా సత్యం మరియు మంచితనంతో కూడిన హృదయం ఎప్పుడూ వ్యర్థం కాదని గీతోపదేశం చేస్తాడు.
అలాగే ఏం చేసినా భగవంతుడికి అర్పించు అని శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు.ఇలా చేయడం ద్వారా స్వేచ్ఛ జీవితాన్ని ఎల్లప్పుడూ ఆనందించవచ్చునని చెబుతాడు.అర్జునుడికి తన కర్తవ్యాన్ని గుర్తుచేసి సత్యామార్గాన్ని అనుసరించాల్సిన అవశ్యకతను గుర్తు చేశాడు.
ఈ అంశాలన్నీ క్రమశిక్షణలో ఉంటే కచ్చితంగా మీ మనసు మీరు చెప్పే విషయాలన్నీటిని వింటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy