Krishna Prasad : తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్‎కు బాపట్ల టీడీపీ ఎంపీ టికెట్..!!

తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్‎కు ( Krishnaprasad )బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికయ్యారు.వరంగల్ బీజేపీ అభ్యర్థిత్వాన్ని కృష్ణప్రసాద్ ఆశించారు.

అయితే అక్కడ అవకాశం దక్కకపోవడంతో ఏపీలో టీడీపీ నుంచి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు.ఈ క్రమంలోనే బాపట్ల టీడీపీ అభ్యర్థిగా ఆయన ఎంపికయ్యారు.

అయితే బాపట్ల టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ( Undavalli Sridevi )భంగపడ్డారు.ఈ నేపథ్యంలో నియోజకవర్గ అభ్యర్థిగా కృష్ణ ప్రసాద్ ఎంపిక కావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాజకీయాలు ఎలా ఉంటాయో.ఎవరు ఎలాంటి వారో తనకు ఈ రోజే అర్థం అయిందంటూ ట్వీట్ చేశారు.

Advertisement

కాగా కృష్ణప్రసాద్ ఎంపిక వ్యవహారం తమ పార్టీలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.కాగా కృష్ణప్రసాద్ ఉమ్మడి రాష్ట్రంలో డీజీగా పని చేశారన్న సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు