రవితేజను బండ్ల గణేష్ మోసం చేశాడా .. ఈ నిజాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

మాస్ మహారాజ్ రవితేజ, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఉందనే సంగతి తెలిసిందే.రవితేజ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఆంజనేయులు సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు మరీ అద్భుతమైన టాక్ రాకపోయినా కమర్షియల్ గా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంది.

 Bandla Ganesh Comments About Raviteja Details Here Goes Viral ,bandla Ganesh-TeluguStop.com

ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

అయితే తాజాగా బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ గురించి షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాను రవితేజను మోసం చేశానని ఆయన తెలిపారు.ఒక ల్యాండ్ విషయంలో నేను రవితేజను మోసం చేయడం జరిగిందని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.రవితేజకు నేను ఒక పొలం అమ్మగా రవితేజ ఎంతో ఇష్టపడి ఆ పొలం కొనుక్కున్నాడని ఆయన తెలిపారు.

ఆ పొలం కింద నాకు 30 ఎకరాల పొలం ఉందని ఆయన తెలిపారు.ఒక వ్యక్తి నా 30 ఎకరాల పొలం కొంటానని చెపాడని అయితే రవితేజ పొలంతో పాటు ఆ పొలం కావాలని చెప్పడంతో రవితేజకు ప్రభుత్వం ఆ ప్రాంతంలో భూ సేకరణ చేస్తుందని ఇప్పుడే పొలం అమ్మితే బెటర్ అని చెప్పి పొలం అమ్మించానని బండ్ల గణేష్ పేర్కొన్నారు.రవితేజకు అబద్ధం చెప్పి మోసం చేశానని బాధ పడ్డానని ఆయన కామెంట్లు చేశారు.

ఆ తర్వాత నేను మోసం చేశానని రవితేజకు చెప్పగా నాకు తెలుసని రవితేజ అన్నారని నన్ను ఏమీ చేయకుండా వదిలేశారని ఆయన చెప్పుకొచ్చారు.బండ్ల గణేష్ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.బండ్ల గణేష్ నిర్మాతగా త్వరలో బిజీ కానున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube