యాదాద్రిలో బండి సంజయ్ ప్రమాణం

బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రి చేరుకున్నారు.ఈ క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి వారి దేవస్థానానికి వెళ్లిన ఆయన ప్రమాణం చేశారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని స్వామివారి పాదాల చెంత బండి సంజయ్ ప్రమాణం చేశారు.అయితే టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించింది బీజేపీ నేతలనేనని టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బండి సంజయ్ యాదాద్రిలో ప్రమాణం చేసేందుకు వెళ్లారు.అదేవిధంగా నిన్న సీఎం కేసీఆర్ సైతం వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.

రుద్రవీణ సినిమా కారణంగా నేను హోం శాఖ తీసుకోలేదు : పవన్ కళ్యాణ్
Advertisement

తాజా వార్తలు