కరీంనగర్ లో బండి సంజయ్ పాదయాత్ర..!!

బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేసేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది.

ఈనెల 7వ తేదీన కరీంనగర్ టౌన్ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్ రెడీ అయ్యారని తెలుస్తోంది.ఇందులో భాగంగా హెలికాప్టర్ ద్వారా ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని సమాచారం.

ఈ క్రమంలోనే ఈనెల 8న సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.మరోవైపు ఈనెల 6న బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు