నెలసరి సమయం దగ్గర పడుతుందంటే చాలు దాదాపు మహిళలందరిలోనూ ఆందోళన, భయం, చికాకు వంటివి ముందే మొదలైపోతుంటాయి.ఎందుకంటే, కడుపు నొప్పి, నడుం నొప్పి, కాళ్ళ నొప్పి, నీరసం, మూడ్ స్వింగ్స్, అధిక రక్తస్రావం, తిమ్మిర్లు.
ఇలా నెలసరి సమయంలో ఎన్నో సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.ముఖ్యంగా కొందరు మహిళలైతే ఆ సమయంలో వచ్చే నొప్పులను తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ను తెగ వేసేసుకుంటారు.
కానీ, పెయిన్ కిల్లర్స్ తాత్కాలికంగా నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందించినా.భవిష్యత్తులో అనేక సమస్యలను సృష్టిస్తాయి.
కాబట్టి, నెలసరి నొప్పుల్ని అధిగమించడం కోసం పెయిన్ కిల్లర్స్ను వాడటం కంటే సహజ పద్ధతులను ఎంచుకోవడం ఎంతో ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే బనానా ఆల్మండ్ స్మూతీ అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఈ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలి.? ఏ సమయంలో దీన్ని తీసుకోవాలి.? వంటి విషయాలను లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు అరటి పండు ముక్కలు, ఆరు పొట్టు తీసిన బాదం పప్పులు, రెండు స్పూన్ల తేనె, మూడు గింజలు తొలగించిన ఖర్జూరాలు, రెండు స్పూన్ల అవిసె గింజలు, పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక గ్లాస్ పాలు వేసి బాగా బ్లెండ్ చేసుకుంటే స్మూతీ సిద్ధమైనట్టే.
ఈ స్మూతీని గ్లాస్లోకి సర్వ్ చేసుకుని బ్రేక్ ఫాస్ట్గా తీసుకోవాలి.
నెలసరి సమయంలో ఈ స్మూతీని సేవించడం వల్ల.ఇందులో ఉండే పలు పోషకాలు వివిధ రకాల నొప్పులను దూరం చేస్తాయి.మానసిక స్థితిని సరి చేస్తాయి.
ఆందోళనలు, మూడ్ స్వింగ్స్ను తగ్గిస్తాయి.మరియు శరీరంలో హార్మోన్ల సమతుల్యాన్ని సైతం కాపాడతాయి.
కాబట్టి, ఇకపై నెలసరి సమయంలో ఈ బనానా ఆల్మండ్ స్మూతీని తీసుకోవడం మాత్రం అస్సలు మరచిపోకండి.