ఎటువంటి బాధ్యత అప్పగించిన బాధ్యతతో నిర్వర్తిస్తా అంటున్న వైసీపీ మాజీ మంత్రి..!!

ఏపీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి కావడం తెలిసిందే.ఈ క్రమంలో ఆయన వైసీపీ హైకమాండ్ పై అలిగినట్లు.

 Balineni Srinivas Reddy Viral Comments On Ysrcp Party Balineni Srinivas Reddy, Y-TeluguStop.com

వార్తలు రాగా అనంతరం సీఎం జగన్ తో బాలినేని భేటీ అయి.అలక పై వచ్చిన వార్తలలో వాస్తవం లేదని మీడియాతో తెలిపారు.ఇదిలా ఉంటే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం సోమవారం ఒంగోలు జిల్లాకు వచ్చిన బాలినేనికి అభిమానులు అడుగడుగున భారీ ర్యాలీ లతో స్వాగతం పలకడం జరిగింది.అనంతరం నివాసంలో బాలినేని మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా ఉన్నప్పటికంటే మంత్రి పదవి రాజీనామా చేశాక… పార్టీ క్యాడర్ లో నాపై ఎక్కువ చూపారని తెలిపారు.

పెద్దఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీని గెలిపించడానికి కృషి చేస్తాను అని పేర్కొన్నారు.

ఈనెల 22వ తారీఖున సీఎం జగన్ “వైయస్సార్ సున్నా వడ్డీ” పథకాన్ని ప్రారంభించడానికి ఒంగోలు వస్తున్నందుకు జిల్లా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు.ఈ క్రమంలో పార్టీ తరఫున ఎటువంటి బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తూ అని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube