రాజన్న సిరిసిల్ల జిల్లా నాబార్డ్( NABARD ) వారి ఆర్థిక సాయంతో ప్రారంభించిన ప్రాజెక్టు “హైడ్రోపొనిక్స్ – ఏ నోవల్ అప్రోచ్ ఫర్ న్యూట్రీషియన్ సెక్యూరిటీ”( Hydroponics ) లో భాగంగా కొదురుపాక గ్రామంలో హైడ్రోపోనిక్స్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కె.
భవ్య శ్రీ, డా.ఆర్.సతీష్ రైతులకు హైడ్రోపొనిక్స్ సాగు విధానాన్ని విపులంగా వివరించారు.రైతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇలాంటి నూతన సాగు విధానాలను తెలియజేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది పాల్గొన్నారు.త్వరలో హైడ్రోపోనిక్స్ యూనిట్ ను వారి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నందుకు రైతులందరూ ఆనందంగా ఆహ్వానించారు.
ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు.