తెలంగాణ సచివాలయం ముట్టడికి యత్నం.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో సచివాలయంలో స్వల్ప ప్రమాదం సంభవించిందన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్లాస్టిక్ సామాగ్రికి మంటలు వ్యాపించాయని తెలిపారు.

 Attempt To Besiege Telangana Secretariat.. Congress Leaders Arrested-TeluguStop.com

అగ్ని ప్రమాదంపై గందరగోళ ప్రకటనలు వస్తున్నాయంటూ కొత్త సచివాలయానికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారు.ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.మరోవైపు సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజున ప్రారంభించాల్సిందేనన్న ఆదేశాలతో నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం జరుపుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించిన విషయం తెలిసిందే.

సీఎం పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడానికి ఇది రాచరిక కాలమా అని ఆయన ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube