చట్టాలు చేసే సభలోనే సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో సీఎం పూర్తిగా దిగజారారని విమర్శించారు.
దళితులతో దళితుడిపై దాడి చేయించడం నీచమైన చర్య అని యనమల మండిపడ్డారు.కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఎమ్మెల్యే స్వామిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.