ఖమ్మం జిల్లా మధిరలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.ఈ క్రమంలో కార్యాలయంలో ఉన్న పూల కుండీలను దుండగులు ధ్వంసం చేశారు.
ఫ్లెక్సీలను కూడా చింపుతుండగా స్థానికులు వారించడంతో దుండగులు అక్కడ నుంచి పరార్ అయ్యారు.ఈ క్రమంలో దాడికి పాల్పడిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పొంగులేటి అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.