తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డైరెక్షన్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్( Puri Jagannadh ) పవన్ కళ్యాణ్ తో చేసిన బద్రి సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మధ్యలో కొన్ని ప్లాప్స్ వచ్చినా కూడా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ పట్టిన కెరటం వలే ముందుకు సాగుతున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన రామ్ ను హీరోగా పెట్టి డబల్ ఇస్మార్ట్( Double iSmart ) అనే సినిమా చేస్తున్నాడు.
ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఇక ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ గా తెలుగులో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.
ఇక ఈ టైంలో మలయాళం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మోహన్ లాల్( Mohanlal ) తనతో ఒక సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు అంట కానీ అనుకోని కారణాలవల్ల వేరే డైరెక్టర్ తో సినిమా చేసినట్టుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ అప్పట్లో మలయాళం ఇండస్ట్రీలో మాత్రం ఈ వార్త చాలా హల్చల్ అయింది.నిజానికి పూరి ఉన్న బిజీ వల్ల పూరి నే ఆ సినిమాని హోల్డ్ లో పెట్టినట్టుగా వార్తలు కూడా వచ్చాయి.
మరి ఇద్దరిలో ఎవరిది మిస్టేక్ ఉందో తెలియదు కానీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చే ఒక సూపర్ హిట్ సినిమా మాత్రం మిస్ అయింది అనే చెప్పాలి.ఇక ఇలాంటి క్రమంలో మళ్లీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ మరికొన్ని వార్థలైతే వస్తున్నాయి.మరి వీటిలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియదు.
కానీ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం చూడ్డానికి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…
.