బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా బయటపడటంతో పలువురు సెలబ్రెటీలను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగించారు.
సుశాంత్ మరణించి సంవత్సరం దాటిన అతని మరణ వార్త గురించి నిత్యం ఏదో ఒక విషయం వార్తల్లో ట్రెండ్ అవుతూనే ఉంది.
తాజాగా సుశాంత్ మరణ వార్త గురించి సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టు చేయాలంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
సుశాంత్ మరణం తర్వాత రియా చక్రవర్తి పై పలు అనుమానాలు రావడంతో సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు చక్రవర్తిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.ఈ క్రమంలోనే నెలరోజుల పాటు జైలులో ఉన్న రియా చక్రవర్తి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే తాజా రియా చక్రవర్తినీ అరెస్టు చేయాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.ఈ విధంగా ఈమెను అరెస్టు చేయడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.
సుశాంత్ కి మేనేజర్ గా వ్యవహరిస్తున్నటువంటి దిశా సలియాన్ మృతి తర్వాత రియా చక్రవర్తి సుశాంత్ తోగొడవ పడి తన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అదేవిధంగా సుశాంత్ మెడికల్ రిపోర్ట్స్, లాప్టాప్ తన వెంట తీసుకుపోవడంతో పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఆమెను అరెస్టు చేసి వాటిపై ఆరా తీయాలని సుశాంత్ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
సుశాంత్ డ్రగ్ సప్లయర్ గా ఉన్న వ్యక్తిని బయట స్వేచ్ఛగా ఎలా తిరిగనిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.అదేవిధంగా సుశాంత్ చనిపోవడానికి ముందుగా తన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన మొబైల్ నెంబర్లను మార్చుకోవడానికి ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి అయితే అలా ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది అకౌంట్ వివరాలన్నింటినీ బయటపెట్టాలి అంటూ ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు కోరుతున్నారు.