గ్రూప్ -1 ప్రిలిమినరి పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.

 Armored Arrangements For Group-1 Preliminary Examination , Group-1 Preliminary E-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం డిగ్రీ కళాశాలలో ఈ నెల 09 వ తేదీన నిర్వహించబోయే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఈ నెల 09 వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాన్నం 1.00 గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలలో 4699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు.గ్రూప్-1 పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని,పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలలో ఉంటాదని,పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ప్రత్యేకంగా పోలీసు నిఘా ఏర్పాటు చేసి జనాలు గుమిగూడకుండా చర్యలు చేపడుతామన్నారు.గ్రూప్-1 పరీక్ష కేంద్రాలలోకి అభ్యర్థులు , చీప్ సూపర్డెంట్ లకు, అబ్జర్వర్లకు,బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లకు, ఇన్విజిలేటర్లకు తప్ప ఇతరులను అనుమతించ వద్దని,పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు.పరీక్ష కేంద్రాలలోనికి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని , ఒక్క చీఫ్ సూపరిండింట్ వద్ద తప్ప ఎవ్వరి మొబైల్ ఫోన్ లకు అనుమతి లేదని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, అగ్రహారం డిగ్రీ కలశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube