చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై ఇవాళ మరోసారి వాదనలు

టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇవాళ కూడా వాదనలు కొనసాగనున్నాయి.రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు భద్రత లేదని, ఆయనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో హౌస్ అరెస్టుకు అనుమతించాలని న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా కోర్టులో వాదనలు వినిపించారు.

 Arguments Once Again Today On Chandrababu's House Arrest Petition-TeluguStop.com

మరోవైపు చంద్రబాబు భద్రతకు వచ్చిన సమస్య ఏమీ లేదని సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు కోర్టుకు వెల్లడించారు.చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించామని పేర్కొన్నారు.జైలులో ఎవరికీ లేని విధంగా చంద్రబాబుకు ప్రత్యేకంగా బ్లాక్ కేటాయించామన్నారు.24 గంటలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్న న్యాయవాది పొన్నవోలు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లు కోర్టుకు తెలిపారు.ఇవాళ మరోసారి దీనిపై వాదనలు విననున్న న్యాయమూర్తి హౌస్ అరెస్టుపై నిర్ణయం ప్రకటిస్తారు.అదేవిధంగా చంద్రబాబును ఐదు రోజులపాటు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నూ కూడా ధర్మాసనం ఇవాళ విచారించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube