సాధారణంగా చెప్పాలంటే కార్బోహైడ్రేట్లు ఆకలిని పెంచేస్తాయి.బరువు పెరగడానికి దారి తీస్తాయి.
బరువు తగ్గడాన్ని మరింత కష్టతరం చేస్తాయి.మనల్ని అలసిపోయేలా చేస్తాయని చాలామంది చెబుతున్నారు.
కానీ దీనిలో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.అవును కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరుగా పని చేస్తాయి.
ఎన్నో విటమిన్లు ఖనిజాల పంపిణీకి సహాయపడతాయి.
బరువు తగ్గాలని కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకుంటే మీకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన మూడు ముఖ్యమైన మాక్రోన్యూట్రియెంట్ల లో కార్బోహైడ్రేట్లు ఒకటి.ఇవి శరీరానికి గ్లూకోజ్ ను అందిస్తాయి.ఇది శరీరక విధులు, శరీరక శ్రమను నిర్వహించడానికి శక్తిగా మారుతుంది.అంతే కాకుండా బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కార్బోహైడ్రేట్లను తగ్గించాలి.
కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ పిండి పదార్థాలను పూర్తిగా నివారించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల శరీరంలో శక్తి తగ్గుతుంది.మన శరీరానికి కార్బోహైడ్రేట్లే ప్రధాన శక్తి వనరు.ఇది లేకపోతే కొవ్వు ప్రోటీన్ వంటి ఇతర పదార్థాలను తీసుకోవాల్సి వస్తుంది.
కిటోసీన్ అనే పిలవబడే ఈ ప్రక్రియ ప్రజలు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే ఇది శరీరంలో అలసట, మగతకు కారణమవుతుంది.అంతేకాకుండా ఇది ఏకాగ్రతను దెబ్బతిస్తుంది.వ్యాయామం వంటి రోజు వారి పనులలో కూడా పాల్గొనడం కుదరదు.

పిండి పదార్థాలను నివారిస్తే కూడా ఆకలి బాగా పెరుగుతుంది.రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవడానికి పిండి పదార్థాలు ఎంతో అవసరం.ఇవి లేకుంటే రక్తంలో చక్కెర స్థాయి పడిపోతుంది.ఇది ఆకలిని పెంచుతుంది.దిని వల్ల అతిగా తింటే బరువు పెరుగుతారు.పిండి పదార్థాలను నివారించడం వల్ల కలిగే దుష్ప్రభావాలలో మలబద్దకం కూడా ఉంది.
శరీరం లో తగినంత ఫైబర్ లేకపోతే మీరు మలబద్దకం, ఉబ్బరం, గ్యాస్ ఇతర జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.







