కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ధ్వజమెత్తారు.డిసెంబర్ 9వ తేదీ లోపు ఇస్తామని కాంగ్రెస్( Congress Party ) ప్రకటించిన ఆరు గ్యారెంటీలు( Six Guarantees ) ఏమయ్యాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నకిలీవేనా అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
కర్ణాటక ఖజానాలో కాసులు లేవంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య( CM Siddharamaiah ) పేరిట విడుదలైన వీడియో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఆ వీడియోను ప్రస్తావించిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గులేకుండా ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు.రైతు భరోసా, రైతుబీమా ఎటు పోయిందని ప్రశ్నించారు.ఇక ఇప్పుడు కర్ణాటక గతే తెలంగాణకు వస్తుందని తెలిపారు.