సోషల్ మీడియా, టెక్నాలజీ పెరిగాక చాలా మంది సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకొని లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.జనాల బలహీనతకి అవకాశంగా తీసుకొని చాలా మంది సైబర్ నేరగాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త మోసాలకి తెరతీస్తున్నారు.
సెలబ్రిటీల పేర్లు వాడుకొని మోసం చేసే నయా కేటుగాళ్ళు సొసైటీలో ఎక్కువైపోయారు.తాజాగా కాజల్ ని విపరీతంగా అభిమానించే ఒక వ్యక్తి ఆమెతో డేటింగ్ అవకాశం అని చెప్పగానే ఆశ పడి వారు అడిగినంత సొమ్ము చెల్లించి ఏకంగా అరవై లక్షలు పోగొట్టుకున్నాడు.
ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
తమిళనాడుకు చెందిన బాగా భాగా బలిసిన ఓ వ్యక్తి కొడుకుకి కాజల్ అంటే ఇష్టం.
ఒక రోజు ఇంటర్నెట్ను చాట్ చేస్తుండగా.మీకు బాగా ఇష్టమైన స్టార్తో డేటింగ్ చేసే అవకాశం అందుకోండి అనే ప్రకటన చూసి దానిని క్లిక్ చేసి అతని వివరాలు ఇచ్చాడు.
ఆ తర్వాత అవతలి వ్యక్తి అతనికి కాజల్ను పరిచయం చేస్తానంటూ ముందుగా 50 వేలు తీసుకున్నాడు.తర్వాత మరికొంచెం సొమ్ము డిమాండ్ చేసాడు.
అలా ఏకంగా పడి లక్షలు లాగేసాడు.అయితే ఆన్ లైన్ లో పైర్చయం అయిన వ్యక్తి ఎంతకీ కాజల్ ని చూపించకపోవడం గట్టిగా అడిగేసరికి అవతలి వ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు.
అలా కాజల్ పేరుతో బ్లాక్ మెయిల్ చేసి ఏకంగా 60 లక్షల వరకు దోచేసాడు.అయితే సైబర్ నేరగాడి బాధ తట్టుకోలేక బాధితుడు ఇళ్ళు వదిలి వెళ్ళిపోవడంతో అసలు విషయం బయటకి వచ్చింది.
కాజల్ అగర్వాల్ పేరుతో అతనిని మోసం చేసిన సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసి పోలీసులు తమదైన శీలిలో విచారిస్తున్నారు.