అప్పు చెల్లించలేదని ఓ వ్యాపారి అప్పు తీసుకున్న వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి దాచిపెట్టాడు.ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాలలో చోటు చేసుకుంది.
నెన్నెల మండలం ఆవ డం గ్రామానికి చెందిన బాసవేన హన్మంతు, సరోజ దంపతులకు, రుషిత్ (3), ఐసు(1) సంతానం.అదే మండలం చిత్తాపూర్కు చెందిన రైస్మిల్లు వ్యాపారి సందాని వద్ద రెండేళ్ల కిందట రూ.20 వేలు అప్పుగా తీసుకున్నాడు.అప్పటి నుంచి అసలుతో పాటు వడ్డీ చెల్లించలేదు.
సందాని అప్పు తిరిగి చెల్లించాల్సిందిగా ఇటీవల కోరడంతో.త్వరలోనే చెల్లిస్తానని చెప్పిన హన్మంతు.కుటుంబాన్ని రెండు నెలల క్రితం అవడం గ్రామం నుంచి మందమర్రికి మార్చాడు.దీంతో.
తనకు చెప్పకుండా మకాం మార్చినందుకు ఆగ్రహించిన వ్యాపారి.హన్మంతు భార్య, పిల్లలను తీసుకెళ్లి రహస్యంగా ఓ ఇంట్లో దాచాడు.
దీంతో కంగారు పడిన హన్మంతు.వారిని దాచిన ఇంటిని కనుక్కొని వెళ్లగా అక్కడ వ్యాపారి అతడ్ని బెదించాడు.
ఆదివారం మరోసారి వెళ్లానని, కొడుకు నాన్నా అంటూ నా వెంట రావడంతో తీసుకొచ్చానని తెలిపాడు.‘అప్పు తీర్చితేనే నీ భార్యా పిల్లలు నీ వెంట వస్తారు.లేకుంటే చంపేస్తా’ అని బెదిరించడంతో నెన్నెల పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.ఇది సివిల్ కేసు, కోర్టుకు వెళ్లమని ఎస్ఐ చెప్పడంతో గత్యంతరం లేక జేసీకి ఫిర్యాదు చేయడానికి వచ్చానని రోదిస్తూ విలేకరులకు చెప్పాడు.
చివరిగా తన భార్యని చూసేందుకు అక్కడికి వెళ్లగా.తన కొడుకు ఏడుస్తుండటంతో తనతో పాటే తీసుకొచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు.