మంత్రి రోజా కామెంట్స్.గుంటూరు లో శిల్పారామం ప్రారంభించుకోవటం సంతోషంగా ఉంది.
రేపు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నలుగురు పద్మశ్రీ అవార్డు గహీతలను సన్మానించాం.నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వ్యయంతో నిర్మించాం.
కుటుంబ సభ్యులతో హాయిగా వచ్చి సేదతీరి, బోటింగ్ లో విహరించే అవకాశం ఇక్కడ ఉంది.హస్తకళలు స్టాల్స్ ఏర్పాటు చేసాం.
ఏపీజే అబ్దుల్ కలాం జీవితం యువతకు ఆదర్శప్రాయం.చిన్న కుటుంబం లో పుట్టి కష్టపడి ఒక సైంటిస్ట్ అయ్యి,తదుపరి రాష్ట్ర పతి అయ్యారు.దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని రెండవసారి స్వీకరించమంటే నిరాకరించారు.పిల్లలకు విద్యను అందించటమే ఆయన ఇష్టపడేవారు.
పదవి అలంకారానికి,అధికార దర్పణానికి కాదు,ప్రజా సేవకే అని చాటిన గొప్ప మనిషి అబ్దుల్ కలాం.