ఏపీలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రానున్న మార్చి నెలలో జరగనున్నాయి.ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు.
మార్చి 18 నుంచి 30 వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స తెలిపారు.ఈ మేరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షా సమయం అని చెప్పారు.అలాగే మార్చి 1వ తేదీ నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయన్నారు.ఒకరోజు ఫస్టియర్ విద్యార్థులకు, రెండో రోజు సెకండియర్ విద్యార్థులను పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గానూ పరీక్షలను ముందుగానే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి బొత్స వెల్లడించారు.