ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీపీసీకి నోటీసు ఇచ్చింది.కాలుష్యం నియంత్రణ చేయకపోవడంపై నోటీస్ జారీ చేసినట్లు తెలుస్తోంది.
దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే చర్యలు తప్పవని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.కాగా గాలి, నీరు కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే.
ఈ తనిఖీలలో కాలుష్యం ఉన్నట్లు నిర్ధారించిన కాలుష్య నియంత్రణ మండలి ఎన్టీపీసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తేల్చింది.ఇందులో భాగంగానే నోటీసు జారీ చేసింది.