రేపు ఏపీ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలు..!!

రేపే ఏపీ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలు( Intermediate supplementary results ) విడుదల కానున్నాయి.మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించగా… ఇటీవలే మూల్యాంకనం పూర్తయింది.

 Ap Intermediate Supplementary Results Tomorrow , Ap Intermediate Results, Ap Int-TeluguStop.com

దీంతో రేపు సాయంత్రం 5 గంటలకు విజయవాడలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఫలితాలను విడుదల చేయబోతున్నారు.ఏప్రిల్ నెలలో ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల కాగా 66.21% ఉత్తీర్ణత నమోదు కావడం జరిగింది.రెండు సంవత్సరాలకు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా… వారిలో 5,38,327 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం జరిగింది.

పాసైన వారిలో ఎక్కువ బాలికలు 65%( Girls 65% ) కాగా బాలురు 58% ఉండటం జరిగింది.మే 24 నుంచి జూన్ 1 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన ఇంటర్, మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్డు … సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ క్రమంలో సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1వ తారీఖు వరకు నిర్వహించగా… రేపు ఫలితాలు విడుదల చేయబోతున్నారు.మరి ఈసారి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలలో ఎంతమంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యుంటారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube