ఏపీలో రోడ్లపై సభలు, ర్యాలీల నిషేధంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలోని నిబంధనలు అందరికీ వర్తిస్తాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.జీవో వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు.
విపక్షాలే రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించొద్దని చెప్పలేదని పేర్కొన్నారు.
ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్రౌండ్ లలో నిర్వహించుకోవచ్చని వెల్లడించారు.నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
రోడ్లు ప్రయాణం కోసమే కానీ.బహిరంగ సమావేశాల కోసం కాదని తెలిపారు.