ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చంద్రబాబు లోకేష్ లపై మండిపడ్డారు.రాష్ట్రంలో ఏయిడేడ్ పాఠశాలలకు ప్రభుత్వం.
అన్యాయం చేస్తోంది అంటూ లోకేష్ మొసలికన్నీరు కారుస్తున్నారని, అసలు ఏయిడెడ్ పాఠశాలలు అంటే ఏమిటో లోకేష్ కి తెలుసా అని ప్రశ్నించారు.ఏయిడెడ్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవటం వల్ల ఇప్పుడు వారంతా సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ఈ తరుణంలో ప్రభుత్వ పాఠశాలలో కలవాలా వద్దా అనేది ఇప్పుడు ఏయిడెడ్ పాఠశాలలకే ఛాయిస్ ఇచ్చామని స్పష్టం చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ విద్యా సంస్థలు గురించి ఆలోచించారా.?, పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకి నియామకాలు ఏమన్నా చేపట్టారా.?? పైగా నియామకాలు చేసేది లేదని చంద్రబాబు చెప్పలేదా అని ప్రశ్నించారు.అటువంటిది ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరూ ఏయిడెడ్ పాఠశాలలకు సంబంధించి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.అనంతపురం లో.రాళ్ళు వేసి రెచ్చగొట్టారని గాయపడిన విద్యార్థిని చెబుతుంటే పోలీసులు లాఠీచార్జి చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులు కామెంట్ చేయడం దారుణమని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు.