AP DSC Notification : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్( AP DSC Notification ) విడుదల అయింది.ఈ మేరకు 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ ను మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) విడుదల చేశారు.

 Ap Dsc Notification : ఏపీ డీఎస్సీ నోటిఫికే�-TeluguStop.com

ఎస్జీటీలు 2,280, స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీజీటీలు 1,264, పీజీటీలు 215 మరియు ప్రిన్సిపల్స్ 42 పోస్టలును భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.దీని ప్రకారం నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు.

ఈ నెల 22న దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అలాగే వచ్చే నెల 5 నుంచి హాల్ టికెట్లు( Hall Tickets ) డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది.మార్చి 15 నుంచి 30 వరకు ఆన్ లైన్ విధానంలో పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు.ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ ఉండనుంది.కాగా 2018 సిలబస్ ప్రకారమే డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube