ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలోని ముగ్గురు ఐఏఎస్ ల బృందం చేరుకుంది.
అదే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంక్వైరీ విభాగాలు ఏర్పాటు చేశారు.అవసరమైన పక్షంలో ఘటనా స్థలానికి పంపడానికి అంబులెన్స్ లను సిద్ధం చేశారు.
ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆస్పత్రులను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.