పర్యావరణ పరిరక్షణ కోసం సంగారెడ్డి టు కాశ్మీర్ సైకిల్ యాత్రను సంగారెడ్డి జిల్లా సదాశివ పేట మండలం తంగేడు పల్లి గ్రామానికి చెందిన దానేశ్వర్ రెడ్డి అనే ఇంటర్ విద్యార్థి ట్రిప్ పేట సైకిల్ యాత్ర చేపట్టారు.
టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ను ముట్టడించేందుకు బీజేపీ ప్రయత్నించింది.టిఆర్ఎస్ బోరబండ డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహ చేతిలో గాయపడిన మహిళకు న్యాయం చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ ముట్టడికి బిజెపి నేతలు ప్రయత్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహన స్త్రీనికి అడ్డుగా వెళ్లిన లక్ష్మీ అనే మహిళపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నీ అంబేద్కర్ తో పోల్చుతూ సంగారెడ్డి కలెక్టర్ శరత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు.
డిసెంబర్ నాటికి ఆర్టీసీ కొత్తగా 630 సూపర్ లగ్జరీ బస్సులను సమకూర్చుకోవాలని తాజాగా నిర్ణయించుకుంది.
విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది.బాడంగి మండల పరిధిలోని రావి వలస గ్రామంలో ఆవులు, గేదెలపై దాడులకు దిగడంతో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు.
తెలుగు తప్ప ఇంగ్లీష్ హిందీ రాని ఓ మహిళ పట్ల ఇండిగో సిబ్బంది వివక్ష చూపించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇండిగో సంస్థ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి రోజా సవాలు విసిరారు.దమ్ముంటే 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ నేడు బిజెపిలో చేరనున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
చండీగఢ్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 23 వరకు బంద్ చేయనున్నారు.
లిక్కర్ స్కాంతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాస్ రెడ్డి అన్నారు .
తెలంగాణ రాష్ట్రంలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఏపీలో నేడు విదేశీ ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది .ప్రకృతి సాగుపై అధ్యయనం చేసేందుకు విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు.
నేడు 12వ రోజు రాహుల్ గాంధీ భారత జూడో యాత్ర కొనసాగిస్తున్నారు.
నేటి నుంచి ఏపీలో బిజెపి ప్రజా పోరుయాత్రను నిర్వహిస్తోంది.
రైతు సమస్యలపై నేడు టిడిపి ఆధ్వర్యంలో ఏపీలో నిరసన కార్యక్రమాలు జరుగునున్నాయి.ఈ కార్యక్రమంలో టిడిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
టిఆర్ఎస్ కి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,180 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 49,0330.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy