న్యూస్ రౌండప్ టాప్ 20

1.బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో టిఆర్ఎస్ నాయకులు హల్చల్ చేశారు.

సంజయ్ ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యోగాలపై ప్రశ్నించడంతో బిజెపి, టీఆర్ఎస్ నాయకులు మధ్య వాగ్వాదం జరిగింది. 

2.తెలంగాణ ఆర్టీసీలో స్వతంత్ర వజ్రోత్సవాలు

  ఆజాద్ ఇక అమృత్ మహోత్సవ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీలో అధికారులు స్వతంత్ర వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.75 ఏళ్ల పైబడిన వారికి సోమవారం తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు. 

3.స్వాతంత్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే

 

భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత కాంగ్రెస్ దేనిని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. 

4.కేంద్రంపై కేసీఆర్ ఆగ్రహం

  కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గోల్కొండ కోటపై సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు .అనంతరం మాట్లాడిన ఆయన కేంద్రం రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయాన్ని ప్రస్తావించారు. 

5.గల్ఫ్ ప్రవాసులకు 5 వేల కోట్లు

 

బహుజన్ సమాజ్వాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవాస తెలంగాణ బిడ్డల కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా 5000 కోట్ల నిధులు కేటాయిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. 

6.మహేష్ భగవత్ కు రాష్ట్రపతి మెడల్

  స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ పోలీసు విభాగానికి చెందిన 14 మంది పోలీసులు కేంద్ర హోం శాఖ ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, ఇండియన్ పోలీస్ మెడల్ పథకాలతో సత్కరించింది.రాచకొండ సిపి మహేష్ భగవత్, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ విభాగం సిఐ దేవేందర్ కు ప్రెసిడెంట్ మెడల్స్ వచ్చాయి. 

7.ఏపీ డీజీపీకి ప్రెసిడెంట్ మెడల్

 

Advertisement

ఆంధ్రప్రదేశ్ డిజిపి కె.వి రాజేంద్రనాథ్ రెడ్డికి ఉత్తమ సేవా పథకం వరించింది.ఆయనకు రాష్ట్రపతి పురస్కారం దక్కింది. 

8.నేను టిడిపిలో అసంతృప్తిగా లేను : కేశినేని నాని

  తాను టిడిపిలో అసంతృప్తిగా లేను అని విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని అన్నారు. 

9.శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తివేత

 

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో అధికారులు జలాశయం కు ఉన్న పది గేట్లు 12 అడుగుల మేర ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 

10.దోనకొండ విమానాశ్రయంలో ఆర్మీ డ్రోన్ల తయారీ

  ప్రకాశం జిల్లా దొనకొండ విమానాశ్రయంలో ద్రోణుల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. 

11.విశాఖలో అగ్నిపథ్ ఆర్మీ ర్యాలీ

 

ఆర్మీ నియామకాల్లో భాగంగా విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో అగ్ని పథ్ ర్యాలీ ప్రారంభమైంది. 

12.వైసీపీ పై పవన్ కళ్యాణ్ విమర్శలు

  మనుషుల్ని అత్యాశకు గురిచేసి ముంచేసే పొంజి స్కీములను ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. 

13.నేడు గుంటూరులో ఆజాదీ సభ

 

ఆజాద్ ఇక అమృత్ మహోత్సవంలో భాగంగా తెలుగుదేశం పార్టీ సోమవారం గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 

14.తిరుమల సమాచారం

  తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.ఆదివారం తిరుమల శ్రీవారిని 50,443 మంది భక్తులు దర్శించుకున్నారు. 

15.భారత్ లో కరోనా

 

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యయి. 

16.నేడు క్షమాబిక్షతో ఖైదీల విడుదల

  నేడు క్షమాభిక్షతో పలు జైలు నుంచి సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేస్తున్నారు. 

17.రాజ్ భవన్ లో తేనేటి విందు

 

Advertisement

ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ లో తేనేటి విందు కార్యక్రమం గవర్నర్ తమిళ సౌందర్యరాజన్ నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 

18.నేటి నుంచి రాగి నాణేల విక్రయం

  నేటి నుంచి తెలంగాణలోని పలు దేవాలయాల్లో రాగి నాణేల విక్రయాన్ని స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రారంభించనున్నారు. 

19.ఆరు ఖండాల్లో ఆజాదిక అమృత్ మహోత్సవ్

 

భారత నౌక దళం ఆరు ఖండాలు మూడు సముద్రాల్లోని ఆరు టైం జోన్లలో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించింది. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,150   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 52,530.

తాజా వార్తలు