రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి.
ఈ వైరస్ పాతదే అయినప్పటికీ కరోనా సమయంలో తీవ్ర రూపం దాల్చడం తో జనాల్లో ఆందోళన నెలకొంది.
నెల్లూరు జిల్లా లో ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని, వారిని ఆదుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు రాసిన లేఖకు సోను సూద్ స్పందించారు.రెండు రోజుల్లో ఆక్సిజన్ జనరేటర్ సమకూర్చి ఇస్తానంటూ హామీ ఇచ్చారు.
టాలీవుడ్ హీరో రామ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది అనారోగ్యంతో రామ్ తాతయ్య మంగళవారం మృతి చెందారు.
టిఎస్ ఈసెట్ 2021 దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది.అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును ఈ నెల 24వ తేదీ వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా పెంచారు.
నెల రోజులుగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతోందని ముంబై ప్రొఫెసర్లు చెబుతున్నారు .మే చివరి నాటికి ఈ వైరస్ ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతుంది అని ప్రొఫెసర్ల బృందంలోని మునేంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.వెంట్రుక కూడా పీకలేవ్ అంటూ ఈటెలను ఉద్దేశించి గంగుల వ్యాఖ్యానించారు.
కరోనా, బ్లాక్ ఫంగస్ పై మంత్రి హరీష్ రావు, సోమేష్ కుమార్, బి ఆర్ కే భవన్ లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణలోని వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాల్లో సీనియర్ ,జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువును టి ఎస్ పి ఎస్ సి పొడిగించింది.ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా నిధులను జగన్ విడుదల చేశారు.మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా పదివేలు చొప్పున నగదుని వారి ఖాతాల్లో జమ చేశారు.
ఇంజనీరింగ్ తో పాటు, అగ్రికల్చర్ వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 26 వరకు పొడిగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరుణ రోగుల కోసం 70 లక్షల రూపాయల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
కరోనా కొత్త ట్రైన్ టు పిల్లలు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం అప్రమత్తమైంది.బుధవారం నుంచి అక్కడ స్కూళ్లు, జూనియర్ కళాశాలను మూసివేయాలని నిర్ణయించింది.
ఈనెల 24 తర్వాత కూడా కర్ణాటక లో లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంకేతాలు ఇచ్చారు.
సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి లో ఎంపీ రఘురామకృష్ణంరాజు కు వైద్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి.
టిటిడి ఉద్యోగులకు రెండు రోజులపాటు రెండోరోజు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.నేడు, రేపు ఈ వాక్సిన్ వేయనున్నారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మెక్సికో కి చెందిన ఆండ్రియా మొజా 2020 ఏడాదికి మిస్ యూనివర్స్ గా ఎంపికయ్యింది.
కరోనా ట్రీట్మెంట్ లో ప్లాస్మా తెరఫీ ని కేంద్ర ప్రభుత్వం సోమవారం తొలగించింది.
కేరళలో రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయబోతోంది.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,640 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,640.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy