టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2.దర్శకుడు చందు మొండేటీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లపై అభఢిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ భారీ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
శ్రీకృష్ణుడి రహస్యాల నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది.రిలీజ్ కుముందే టీజర్, ట్రైలర్ తో పాన్ ఇండియా వైడ్ గా బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా తాజాగా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 13న థియేటర్లలో విడుదల అయింది.2014లో వచ్చిన కార్తికేయసినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది.కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ఊహించిన విధంగానే విడుదల అయిన మొదటి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ నేపథ్యంలో ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలని చిత్ర బృందం థియేటర్లకు వెళ్లింది.
అక్కడ ప్రేక్షకుల స్పందన చూసి హీరో నిఖిల్, డైరెక్టర్ ఎమోషనల్ అయ్యారు.
ఇద్దరు కూడా ఆత్మీయంగా కౌగిలించుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు.ఇదిలా వుంటే ఈ మూవీని ప్రత్యేకంగా వీక్షించిన దర్శకుడు రాజమౌళి, ఆయన సోదరుడు, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి షో పూర్తయిపోగానే పార్కింగ్ ప్లేస్ లోకి హెవీ క్రౌడ్ మధ్య బయటికి రాగా ఇంతలోనే అక్కడకి బ్యూటీ అనుపమ కూడా వచ్చింది.అయితే దర్శకుడు రాజమౌళిని చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిన అనుమ పరమేశ్వరన్ ఆయన కాళ్లకు నమస్కరించడం విశేషం.
ఈ హఠాత్పరిణామానికి రాజమౌళితో పాటు కీరవాణి కూడా షాక్ అయినట్టుగా తెలుస్తోంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అనంతరం రాజమౌళి, సినిమాలో అనుపమ పాత్ర గురించి, ఆమె నటను గురించి మాట్లాడుతూ ఆమెను మెచ్చుకున్నారట.