పార్టీలో చేరికపై మాజీ ఎంపీ పొంగులేటి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు.సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ చేరిక వ్యవహారంపై కార్యకర్తల అభిప్రాయం తీసుకున్నట్లు తెలిపారు.
నాలుగైదు రోజులలోపే నిర్ణయాన్ని ప్రకటిస్తానని పొంగులేటి తెలిపారు.ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరుతానన్న ఆయన ఏ పార్టీ, విధివిధానాలు ఏంటనేది వెల్లడిస్తానన్నారు.
అదేవిధంగా తన టార్గెట్ బీఆర్ఎస్ అన్న పొంగులేటి వడ్డీతో సహా ఇచ్చి పడేసే సమయం వచ్చిందని స్పష్టం చేశారు.