త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల( BRS MP Candidates ) ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించిన గులాబీ బాస్ కేసీఆర్( KCR ) మరో రెండు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఈ మేరకు భువనగిరి లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్,( Kyama Mallesh ) నల్గొండ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి( Kancharla Krishna Reddy ) పేరును ప్రకటించారు.కాగా హైదరాబాద్ మినహా అన్ని స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు.