కొందరు ఏమీ లేక చిన్న చిన్న జాబులు చేస్తుంటారు.అలాంటి వారిని చూస్తే ఎవరికైనా కొంత జాలిగానే అనిపిస్తుంది.
అయితే కొందరు మాత్రం కోట్లు ఉన్నా కూడా చిన్న జాబులు చేస్తుంటారు.ఇకపోతే ఇప్పుడు కూడా ఓ మహిళ కోట్లు ఉన్నా కూడా ఓ చిన్న పని చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయిపోయారంటే నమ్మండి.ఇంతకీ విషయం ఏంటంటే ఆమె పేరుకు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది.
మరి అంగన్ వాడీ కార్యకర్త అంటే పేదోళ్లు ఉంటారు కదా అనుకునేరు.
కానీ ఆమె ఆమె వెనకేసిన ఆస్తులు కోట్లలో ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా.
కాన ఇదినిజమేనండి.ఆమె దాగ్గర కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి.దాదాపుగా రూ.4 కోట్లకు పైగా స్థిరాస్తులు కూడబెట్టినట్టు తెలిసింది.అయితే ఈ షాకింగ్ ఘటన ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నగరంలో జరగడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ పట్టణంలోని కొరొడొకొంటా అంగన్ వాడీ కేంద్రంకార్యకర్తగా పనిచేస్తున్న కబితా మఠాన్ కు చెందినవే ఈ ఆస్తులు అన్నీ.
ఇక ఆమె మీద రీసెంట్ గా కొన్ని ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు ఆమె ఇంట్లో తనిఖీలు చేశారు.
ఇక ఆమె ఆస్తులు చూసి అందరూ నోరెళ్ల బెట్టారు.దాదాపుగా జిల్లాలోని 6 ప్రదేశాలలో ఆఫీసరల్ఉ సోదాలు నిర్వహంచారు.ఆమెకు సొంతంగా 4 బిల్డింగులు, 10 ఇళ్ల జాగాలు అలాగే కోట్లు విలువ చేసే స్థిరాస్తులతో పాటు కార్లు, బంగారు నగలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఆ అంగన్ వాడీ కార్యకర్తకు 4 అంతస్తుల బిల్డింగ్తో పాటు 3 అంతస్తుల బిల్డొఇంగ్లు ఉన్నాయని చెప్పారు.ఇవ అత్యంత విలువైన బైక్లు కూడా ఉన్నాయంట.ఇక అన్ని ఆస్తులు కలిసి దాదాపుగు రూ.4కోట్లు ఉంటుందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.