ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకల మారడానికి సిద్ధంగా ఉంది: టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత.

పాయకరావుపేట మండలం మంగావరం గ్రామం లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం లో టిడిపి మాజీ ఎమ్మెల్యే తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పాల్గొన్నారు.అనంతరం పాయకరావుపేట లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ఇప్పటికే ఈ ప్రభుత్వం రాష్ట్రాని అప్పుల్లో ముంచేసింది అని సుమారు 7 లక్షల కోట్లు అప్పు ఉందని ఈ లోటు భర్తీ చేయడానికి వచ్చే ఏ ప్రభుత్వానికి అయినా చాలా సమయం పడుతుందని రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ మరో శ్రీలంక లా మారడానికి సిద్ధంగా ఉందని అన్నారు.

 Andhra Pradesh Is Ready To Switch To Another Sri Lanka: Tdp Ex-mla Vangalapudi A-TeluguStop.com

ప్రజా సంక్షేమం ప్రజా భద్రత వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఏదో రోజు ప్రజలే తిరగబడి ప్రశ్నిస్తారు అని అన్నారు.ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే వారి పైన తప్పుడు కేసులు పెట్టడం హౌస్ అరెస్ట్ లు చెయ్యడం చేస్తున్నారని అన్నారు.

ఆసరా పేరుతో 45 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube