తెలుగు బిగ్బాస్ సీజన్ 2 ఎంతో ఆసక్తిగా సాగుతుంది.మొన్నటి ఆదివారం నందిని రాయ్ ఇంటినుండి ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే.
ఇక గత వారం గతంలో ఎలిమినేట్ అయిన శ్యామల మరియు నూతన్ నాయుడులు రీ ఎంట్రీ ఇచ్చారు.బయట సోషల్ మీడియాలో పరిస్థితి ఏంటీ, కౌశల్కు ఉన్న ఫ్యాన్స్ మరియు ఎలా మాట్లాడితే ఎలా ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు అనే విషయం రీ ఎంట్రీ ఇచ్చిన వారికి బాగా తెలుసు.
అందుకే నూతన్ నాయుడు మరియు శ్యామలలు సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తుంది.ఇప్పటికే నూతన్ నాయుడు చాలా క్లోజ్గా కౌశల్తో మాట్లాడుతూ ఉండగా, శ్యామల ఆచితూచి మాట్లాడుతూ వస్తుంది.
శ్యామల ముఖ్యంగా కౌశల్తో జాగ్రత్తగా ఉంటుంది.గీతామాధురి మరియు దీప్తిు కౌశల్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా శ్యామల మాత్రం ఆయన గురించి జాగ్రత్తగా మాట్లాడుతూ వస్తుంది.కౌశల్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేస్తున్నారని, వారికి కౌశల్ను సేవ్ చేయడంతో పాటు, కౌశల్కు వ్యతిరేకంగా ఉన్న వారిని ఎలిమినేట్ చేయడం కూడా వచ్చు అంటూ శ్యామలకు తెలిసి పోయింది.అందుకే కౌశల్తో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమె ఆడుతూ వస్తుంది.
నిన్నటి ఎపిసోడ్లో గీతామాధురి మరియు కౌశల్ల మద్య వాదోపవాదం అవుతున్న సమయంలో శ్యామల నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారీగారు అంటూ పక్కకు తప్పుకోవడంతోనే ఆమె ఏ రేంజ్లో కౌశల్ నుండి సేఫ్ గేమ్ ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు.శ్యామల చాలా జాగ్రత్త పడుతుందని ఆమె బాడీలాంగ్వేజ్తోనే తేలిపోతుంది.టాస్క్ల సమయంలో చాలా యాక్టివ్గా ఉంటూ, సాదారణ సమయంలో అందరికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఆమె ఉద్దేశ్యంగా అనిపిస్తుంది.మొత్తానికి శ్యామల మరియు నూతన్ నాయుడులకు బయట పరిస్థితులు తెలుసు కనుక సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
నూతన్ నాయుడు కౌశల్కు స్నేహితుడు అయ్యాడు కనుక పర్వాలేదు, శ్యామల కూడా కౌశల్తో ఎలాంటి సున్నం పెట్టుకోకుండా, కౌశల్ ఆర్మీకి బలికాకుండా ఉండేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.కాని ఇతర ఇంటి సభ్యులకు మాత్రం కౌశల్ ఆర్మీ గురించి తెలియక పోవడంతో వారు కౌశల్తో మునుపటి తరహాలోనే ఉంటూ వస్తున్నారు.