బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కూడా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.ఎన్ని ట్రోల్స్ వచ్చిన.
ఎన్ని వివాదాలు చుట్టూ ముట్టినా మంచి టీఆర్పీ రేటింగ్ తో ఈ షో దూసుకు పోతుందనే చెప్పాలి.చిన్న చిన్న వివాదాలు, ట్రోల్స్ పెద్దగా ఈ షో పై ప్రభావం చూపించలేక పోతున్నాయి.
ప్రతి సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ఎలిమినేషన్ చర్చ జరుగుతూనే ఉంది.
ఇక బిగ్ బాస్ ప్రతి సీజన్ లో అనుకోని ఎలిమినేషన్ జరగడం వాళ్ళ ఫ్యాన్స్ ఆందోళనలు చేయడం సర్వసాధారణ మైన విషయమే.ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ నుండి యాంకర్ రవి ఎలిమినేషన్ అతడి ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు.యాంకర్ రవి హౌస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్.
ఇతడు చివరి వరకు ఉంటాడు అని అంత అనుకున్నారు.కానీ గత వారం జరిగిన ఎలిమినేషన్స్ లో రవి బయటకు రావడంతో అందరు షాక్ అయ్యారు.
బిగ్ బాస్ ఓట్లు చూసి పంపలేదని ఫ్యాన్స్ ఆందోళన కూడా చేశారు.ఇక ఈయన బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి ఫ్యాన్స్ ను పలకరించాడు.
ఇందులో ఒక కంటెస్టెంట్ పై రవి సంచలన వ్యాఖ్యలు చేసాడు.ప్రసెంట్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇతడు లైవ్ లో శ్రీరామ్ చంద్ర పై కామెంట్స్ చేసాడు.
శ్రీరామ చంద్ర ను బిగ్ బాస్ వాళ్ళు సరైన స్పేస్ ఇచ్చి చూపించడం లేదని కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పేసాడు.బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నుండి చూస్తే నేను గమనించిన విషయం ఇది అని.బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుండి కూడా ఇప్పటి వరకు తనకి ఇచ్చిన పని తప్పకుండ చేసే ఫస్ట్ కంటెస్టెంట్ శ్రీరామ చంద్ర అని.అలాంటిది అతడికి తగినంత స్పేస్ ఇవ్వడం లేదని ఎపిసోడ్స్ అన్ని చూసాక నాకు ఇదే అనిపించింది అని రవి చెప్పాడు.ఇక రవి చేసిన కామెంట్స్ ప్రసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.