తల్లా.. పెళ్ళామా.... అంటున్న అనసూయ

టాలీవుడ్ లో దాదాపుగా అన్ని తెలుగు ప్రముఖ ఛానల్లో షోలు నిర్వహించేటువంటి యాంకర్లలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది.

ఎందుకంటే ఈమె ఛానల్ తో సంబంధం లేకుండా, ఈటీవీ, మాటీవీ, జీ తెలుగు, జెమిని ఛానల్ ఇలా అన్ని చానల్స్ లోనూ తన హవా కొనసాగించింది.

అయితే తాజాగా ఈ అమ్మడు ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క షోలు, ఈవెంట్లతో బిజీబిజీగా గడుపుతోంది.తాజాగా అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మరో కొత్త షో జెమినీ ఛానల్ లో ప్రసారం కానుంది.

అయితే ఇప్పటివరకు అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి షోల పేర్ల కంటే ఈ షో పేరు చాలా భిన్నంగా ఉంది.ఇంతకీ షో పేరు ఏంటంటే "తల్లా.? పెళ్ళామా.?".ఈ షో కి సంబంధించినటువంటి ప్రోమోని కూడా షో నిర్వాహకులు ఇప్పటికే విడుదల చేశారు.ఇందులో అనసూయ కొత్త తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకొనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏదేమైనప్పటికీ యాంకర్ అనసూయ మాత్రం తన అందం అభినయంతో పలురకాల ఈవెంట్లు షోలల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఇతర యాంకర్లకు అవకాశాలు లేకుండా చేస్తోంది.

Advertisement

అయితే తాజాగా ఈ అమ్మడు విజయ్ దేవరకొండ చేస్తున్నటువంటి ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది.అంతేగాక ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న టువంటి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కూడా నటిస్తోంది ఈ అమ్మడు.దీంతో ఒక పక్క సినిమాలు మరోపక్క చానల్ షోలు ఇలా చేతినిండా అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు