జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ వెండితెరపై పలు సినిమాలలో సందడి చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు.ఎప్పుడైతే ఈమె సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారో అప్పటినుంచి అనసూయకు వెండితెరపై కూడా వరుస అవకాశాలు వచ్చాయి.
ఇకపోతే అనసూయ ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వెండితెరపై అవకాశాలు రావడంతో ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కూడా దూరమవుతున్నారు.
ఈమె కేవలం సినిమాలో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే అనసూయ కన్యాశుల్కం అనే ఓ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం ఈ ‘కన్యాశుల్కం’.ఇందులో అనసూయ సరికొత్త పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ వెబ్ సిరీస్ లో అనసూయ మధురవాణి అనే ఒక వేశ్య పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.
ఇక ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన కథ మొత్తం అనసూయ పాత్ర చుట్టే తిరుగుతుందని త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడునున్నట్లు సమాచారం.ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది.ఈయన ఒకవైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లను కూడా తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే క్రిష్ దశతత్వంలో 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.త్వరలోనే అనసూయ చేయబోతున్న కన్యాశుల్కం వెబ్ సిరీస్ గురించి కూడా అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.