అనసూయ గురించిన ఆ వార్తలన్నీ పుకార్లేనా?

కొన్ని రోజుల క్రితం అనసూయ షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇవ్వబోతుంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

అమితాబచ్చన్‌ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు.

తనకు ఇద్దరు పిల్లలు ఉన్న కారణంగా వారి ఆరోగ్యం మరియు భద్రత దృష్టిలో పెట్టుకుని జబర్దస్త్‌తో పాటు ఇతర షో షూటింగ్స్‌కు హాజరు కాకుడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా ప్రచారం జరిగింది.మీడియాలో అంతగా జరిగిన ప్రచారం అంతా ఉత్తదే అని అనిపిస్తుంది.

అనసూయ ఇంకా షూటింగ్స్‌ కు హాజరు అవుతూనే ఉంది. జబర్దస్త్‌ షోలో మాత్రమే కాకుండా ఇటీవల క్యాష్‌ షోలో మరియు ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా ఆమె పాల్గొంటుంది.

ఆమె ప్రస్తుతం ఒక వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.లాక్‌ డౌన్‌ టైమ్‌లో షూటింగ్స్‌ నిలిపేస్తే ఈఎంఐలు కట్టడం ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యలు చేసిన అనసూయ ఇప్పుడు ఎలా షూటింగ్స్‌ మానేస్తుందని కొందరు అంటున్నారు.

Advertisement

అవన్ని కూడా కేవలం పుకార్లు మాత్రమే ఆమె ఖచ్చితంగా షూటింగ్స్‌ను కొనసాగిస్తుందని కొందరు అనుకున్నారు.వాళ్లు అనుకున్నట్లుగానే ఇప్పుడు అనసూయ షూటింగ్స్‌కు రెగ్యులర్‌గా హాజరు అవుతుంది.

అయితే ఆ సమయంలో మాత్రం ఆమె చాలా జాగ్రత్తలు పాటిస్తుంది.పిల్లల విషయంలో కూడా ఆమె జాగ్రత్తగా ఉంటుంది.

పిల్లలకు సాధ్యం అయినంత దూరంగా ఉండేందుకు ఆమె ప్రయత్నిస్తుందట.

Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest
Advertisement

తాజా వార్తలు