టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన అనసూయ చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.తన ప్రతిభతో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకున్న అనసూయ పలు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో నటించి ఆ ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.
అనసూయ సొంతంగా ఒక కవిత రాయగా ఆ కవిత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అనసూయ కవిత చూసి ఆమెలో ఇంత టాలెంట్ ఉందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
“మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నాపేదెలా నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదేలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం” అంటూ అద్భుతమైన కవితతో అనసూయ నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నారు.అనసూయ అందంగానే ఉండటంతో పాటు అందమైన కవితలను కూడా రాస్తారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అనసూయ ప్రయత్నిస్తే సినిమాలకు మాటలు, పాటలు కూడా రాయగలరని కొంతమంది కామెంట్లు చేస్తుండగా అనసూయ సొంతంగానే ఈ కవిత రాశారా? అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.అనసూయ కవితకు నెగిటివ్ కామెంట్ల కంటే పాజిటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తుండటం అనసూయ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.
అనసూయ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.
అనసూయ రేంజ్ భారీగా పెరుగుతుండగా త్వరలో అనసూయ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది.పూర్తిగా వెండితెరపై దృష్టి పెట్టిన అనసూయ రాబోయే రోజుల్లో కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తారేమో చూడాల్సి ఉంది.ఎవరిని ఉద్దేశించి అనసూయ కవిత రాశారనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.
కెరీర్ విషయంలో అనసూయ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.