కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. ఈ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగు తమిళ హిందీ భాషలలో ఎంతో అద్భుతమైన విషయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా 16 కోట్ల బడ్జెట్ తో 400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది అంటే ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్థమవుతుంది.ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటనకు ఎంతోమంది సినీ ప్రముఖులు అతనిపై ప్రశంసల కురిపించారు.
ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలలో రిషబ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఈ విధంగా కాంతర సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ప్రస్తుతం రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.
ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.ఇకపోతే తాజాగా ఈ సినిమాపై ప్రముఖ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ స్పందించారు.
ఈ సినిమా గురించి ఈమె మాట్లాడటమే కాకుండా రిషబ్ శెట్టి నటనపై ప్రశంశలు కురిపించారు.
కాంతార సినిమా గురించి అనసూయ మాట్లాడుతూ ఇందులో రిషబ్ శెట్టి నమ్మశక్యం కాని రీతిలో నటించారని తాను ఇంకా ఆ ప్రభావం నుంచి బయటపడలేకపోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా కాంతర సినిమా గురించి ఇందులో రిషబ్ శెట్టి నటన గురించి ఈమె చెప్పుకొచ్చారు.ఈ విధంగా కాంతార సినిమా గురించి అనసూయ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈమె ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.