కర్నాటక జైల్ లో అక్రమ ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న శశికళ త్వరలోనే జైలు నుండి విడుదల కానున్నది.ఈ నేపథ్యంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం అధికార ప్రతినిధి సిఆర్ సరస్వతి కొన్ని కీలక ఆరోపణలు చేసింది.
అన్నాడీఎంకే అంటే శశికళ అని ఆమె జైలు నుండి బయటకు రాగానే ఆమె చేతిలోకి పార్టీ వెల్లుతుందని ఆమె అన్నారు.ఆమె దయతోనే ఆ పార్టీలోని నేతలు ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారని ఆమె చెప్పింది.
ఈ విషయం చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడాని సరస్వతి చెప్పుకొచ్చింది.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవ్వడానికి శశికలే కారణం అన్నారు.
ఆమె జైలు నుండి బయటకు వచ్చిన పార్టీలో పెద్ద మార్పు ఏది రాదని చెబుతున్నా నేతలు ఒకప్పుడు ఆమె పెట్టిన రాజకీయ బిక్షే అన్నారు.ప్రస్తుతం సిఎం గా ఉన్న పళనిస్వామి స్వామి ముఖ్యమంత్రి పదవి చేపట్టడం వెనుక మాపార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ఉన్నారని ఆమె తెలిపింది.అన్నాడీఎంకే లోని చాలా మంది నేతలు ఆమె రాకాకోసం ఎదురుచూస్తున్నారు.ఆమె వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయాలు మరబోతున్నాయి అంటూ ఆమె అన్నారు.త్వరలో తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి.ఈ నేపథ్యంలో శశికళ పోలిటికల్ రీ ఎంట్రీని ఆ పార్టీ నేతలు గ్రాండ్ గా సెలబ్రేట్ చెయ్యనున్నారని వార్తలు వస్తున్నాయి.