బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే.ఆయనతో పాటు ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇంకా మనవరాలు ఆరాధ్య బచ్చన్లు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది.
ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా మీడియా ముందు కూర్చుని చూస్తున్నారు.అమితాబచ్చన్ ఇంకా అభిషేక్ బచ్చన్లకు సింటమ్స్ కాస్త ఎక్కువగానే ఉన్నాయి.
దాంతో వారిని ముంబయిలోని నానవతి హాస్పిటల్లో ఉంచి చికిత్స చేస్తున్నారు.తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఐసోలేషన్లో ఉన్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.
ఐశ్వర్య రాయ్ ఇంకా ఆరాధ్యలు మాత్రం ఎక్కడ ఉన్నారు వారి పరిస్థితి ఏంటీ అనేది ఇప్పటి వరకు ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.తాజాగా అభిషేక్ బచ్చన్ ట్విట్టర్లో ఐశ్వర్య మరియు ఆరాద్యల ఆరోగ్య పరిస్థితిపై స్పందించాడు.
వైధ్యులు వారిద్దరిని కూడా ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోమన్నారు.ప్రస్తుతం వారికి కరోనా లక్షణాలు అధికంగా లేకపోవడంతో వల్ల ఆందోళన పడాల్సిన పనిలేదన్నాడు.
తండ్రి కొడుకులు హాస్పిటల్లో ఐసోలేషన్లో ఉంటే తల్లికూతురు ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నారు.రెగ్యులర్గా వారి ఆరోగ్య పరిస్థితిసి సమీక్షించి అవసరం అయితే ఆసుపత్రికి తరలించే విషయమై నిర్ణయం తీసుకుంటామని ఐశ్వర్య రాయ్ ఆరాధ్యలను ట్రీట్చేస్తున్న వైధ్యుడు పేర్కొన్నాడు.ఇక అమితాబచ్చన్ ఆరోగ్యం గురించి ఆందోళన అక్కలేదని ఆయన త్వరలోనే కరోనాను జయిస్తాడనే నమ్మకం ఉందని కుటుంబ సభ్యులు ధీమాగా ఉన్నారు.