తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు అయింది.ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.
ఈనెల 23న ముందుగా మధ్యాహ్నం 3.30 గంటలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు అమిత్ షా.సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ నోవాటెల్ లో ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.ఇటీవల ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్న ట్రిపుల్ ఆర్ చిత్ర బృందాన్ని ప్రశంసించనున్నారని తెలుస్తోంది.తరువాత సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.అనంతరం సాయంత్రం 6 గంటలకు చేవెళ్లలో నిర్వహించే బీజేపీ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.
రాత్రి 7 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు.







