తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తనదైన రీతిలో సత్తా చాటుకున్న అల్లు అర్జున్( Allu Arjun ) ఇప్పుడు మాత్రం పుష్ప 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డు కొడుతుందంటూ ఆ సినిమా యూనిట్ మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.
ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ ఈ సినిమా సక్సెస్ తో మరోసారి బాలీవుడ్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా( Pushpa 2 ) నుంచి ఒక డైలాగ్ లీక్ అయింది.ఇప్పుడు అది సోషల్ మీడియా మొత్తం విపరీతంగా వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే మంగళం శీను( Mangalam Seenu ), ఆయన భార్య అయిన కాత్యాయని ఇద్దరూ కలిసి పుష్ప ను చంపడానికి ప్లాన్ చేస్తారు.
అందులో భాగంగానే ఫేక్ పోలీసులతో పుష్పను అరెస్టు చేయిస్తారు.డైరెక్ట్ గా ఆ పోలీసులు పుష్ప ను తీసుకొని మంగళం శ్రీను దగ్గరికి వెళతారు.అక్కడ పోలీస్ గెటప్ లో వచ్చిన వాళ్లు మంగళం శీను మనుషులు కాదు అని తెలుసుకున్న మంగళం శ్రీను అందరి మీద అటాక్ చేయిస్తాడు.
అప్పుడు పుష్ప( Pushpa ) తనదైన రీతిలో తనని తాను రక్షించుకొని ఫైట్ చేసే క్రమంలో మంగళ శీను తో పుష్ప ఒక డైలాగ్ చెప్తాడు.‘చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి’.అనే డైలాగ్( Pushpa Dialogue Leak ) చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరిని చంపేసి పుష్ప వెళ్లిపోతాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ డైలాగ్ విపరీతంగా వైరల్ అవుతుంది…
.