ఎన్టీఆర్ మాట్లాడిన ఆ ఒక్క మాటతో సెట్లో అంత షాక్ !

అప్పల్లో ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.వీరిద్దరు కలిసి నటించిన సినిమాల్లో ఎక్కువగా అధిక వసూళ్లు సాధించినవే ఉన్నాయి.

వీరిద్దరు కలిసి నటించిన వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు సినిమా షూటింగ్ సమయంలో ఓ విచిత్ర ఘటన జరిగింది.ఏవీఎం స్టూడియోలో ఎన్టీ రామారావు, శ్రీ‌దేవి జంట‌పై బెడ్‌రూమ్‌ సీన్ షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ క‌ట్టా సుబ్బారావు.

ఓ గ్లాసులో శ్రీ‌దేవి హార్లిక్స్ ప‌ట్టుకొని బెడ్‌రూమ్ ద‌గ్గ‌రకి వస్తుంది.డైరెక్టర్ యాక్ష‌న్ చెప్పగానే వెళ్లి ఎన్టీఆర్ కు ఇస్తుంది.

ఏంటిది అంటాడు ఎన్టీఆర్.హార్లిక్స్ అంటుంది శ్రీదేవి.

Advertisement

మధ్యలో అదెండుకు అంటూ శ్రీదేవిని మంచ మీదికి లాగుతాడు.ఆమె భుజాల మీద చేతులు వేసి కౌగిలించుకోవాలనుకుంటాడు.

ముందు ఈ హార్లిక్స్ తాగితే ఇంకా స్ట్రాంగా ఉంటారు అంటుంది శ్రీదేవి.నాకో సాయం చేస్తావా? అంటాడు ఎన్టీఆర్.చెప్పండి అంటుంది శ్రీదేవి.

గొల్లభామ పాల డబ్బాలు అమ్ముతారు.అవి తెచ్చి.

పాలసీసాలో పోసి దానికో పీక పెట్టి నా నోట్టో పెట్టు అంటాడు ఎన్టీఆర్.అబ్బా నాకు పనులున్నాయ్ అంటూ అక్కడి నుంచి తప్పించుకుంటుంది శ్రీదేవి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
షారుఖ్ కంటే ఎక్కువ పారితోషికం ఆఫర్ చేసినా రిజెక్ట్ చేసిన పవన్.. కారణాలివే!

దర్శకుడు కట్ చెప్తాడు.

Advertisement

అదే సమయంలో స్టిల్ ఫోటోగ్రాఫర్లు ఎన్టీఆర్ దగ్గరకు వస్తారు.సార్ స్టిల్ అంటారు శ్రీదేవిని పిలవండి అంటాడు దర్శకుడు.ఎన్టీఆర్, శ్రీదేవి మంచం మీద రొమాంటిక్ స్టిల్స్ ఇస్తున్నారు.

వన్ మోర్ సార్ అంటున్నారు ఫోటోగ్రాఫర్లు.హీరో, హీరోయిన్లు చాలా ఫోజులు ఇచ్చారు.

ఎంతసేపటికి వాళ్లు ఆపట్లేరు.చూసి చూసి దర్శకుడు సుబ్బారావుతో ఎన్టీఆర్ ఓ మాట అంటారు.

ఏం బ్రదర్ శ్రీదేవికి, నాకు ఇదే లాస్ట్ సీన్ అని చెప్పారా? ఫోటో గ్రాఫర్లు ఇన్ని స్టిల్స్ తీస్తున్నారు.మాకింకా పాటలున్నాయి కదా? అంటాడు.దీంతో అక్కడున్న వారింతా నవ్వుతారు.

ఎన్టీఆర్ మాటతో స్టిల్ ఫోటోగ్రాఫర్ల కెమెరా క్లిక్ లు వెంటనే ఆగిపోయాయి.అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు.

తాజా వార్తలు